గాంధీ భవన్ కు చేరిన వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ
By Anand kumar
On
వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయితీ మరోసారి గాంధీభవన్ కు చేరింది. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులను జారీ చేసింది. పార్టీ జారీ చేసిన నోటీసులకు క్రమశిక్షణ సంఘం ముందు హాజరై కొండా మురళి వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన వ్యతిరేక వర్గీయులైన జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి గాంధీ భవన్ కు చేరుకొని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...