మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడులు... కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్ల కేటాయింపులలో మల్లారెడ్డి విద్యాసంస్థలలో అధిక ఫీజులను వసూలు చేస్తున్న పలు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు, మల్లారెడ్డి తో పాటు ఆయన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలను నిర్వహించారు. అంతకుముందు ఆదాయ పన్ను శాఖ అధికారులు మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఆదాయాలపై ఆరా తీయగా, ఆదాయ పన్నుకు నివేదించిన లెక్కలకు, అందుబాటులో ఉన్న అకౌంట్స్ కు మధ్య పెద్ద ఎత్తున తేడాలు ఉన్నట్లు గుర్తించారు.
About The Author
