కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం... ఏమి చర్చిస్తున్నారో అని సర్వత్రా ఆసక్తి

కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం... ఏమి చర్చిస్తున్నారో అని  సర్వత్రా  ఆసక్తి

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతోంది. ఈ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రివర్గ సమావేశంలో సమీక్షించనున్నారు. గత మంత్రిమండలి సమావేశంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి స్టేటస్ రిపోర్టు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాలలో 327 నిర్ణయాలు, వాటి అమలు తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారు. ఎన్ డి ఎస్ ఏ, విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల తీసుకునే అవకాశం పై చర్చించడంతోపాటు, స్టాంపులు రిజిస్ట్రేషన్ సవరణ చట్టం, పేదలకు రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు