మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

నేరం జరిగిన ప్రదేశంలో నమూనాలను సేకరించి దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చు

మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర

సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు

 

నల్లగొండ(పెన్ కౌంటర్):-

 జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరితగతిన చేరుకొని, నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో, డిఎన్ఎ శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా, సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, ఎల్ఈడీ సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్రపరచి, ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయన్నారు. ఎప్పుడైన హత్యలు, మానభంగాలు, అనుమానస్పద మరణాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు, ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ, నేరదర్యాప్తు విషయంలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో ఉండడం వలన, నేర పరిశోధన సులభతరం అవుతుందన్నారు. ఈ మొబైల్ వాహనాల ఉపయోగం వల్ల దర్యాప్తు త్వరిగతన పూర్తి అవుతుందని, నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ క్లూస్ టీమ్ ఇంచార్జి ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా