బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రజాధనాన్ని వెచ్చించి వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడడంతో , మరోసారి నలువైపుల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు