బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రజాధనాన్ని వెచ్చించి వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడడంతో , మరోసారి నలువైపుల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం  మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 
        మర్రిగూడ (పెన్ కౌంటర్):-     మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు