బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం

గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రజాధనాన్ని వెచ్చించి వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడడంతో , మరోసారి నలువైపుల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా