ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన 

 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో చెల్లించినట్లుగా ఆధారాలు సిట్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తుండడంతో, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా