సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ

సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 79 రూపాయలను మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. 2025వ సంవత్సరానికి గుర్తుగా వివిధ పరీక్షలను 2025 రూపాయలకే చేస్తున్నట్లుగా వివరించారు. కిడ్నీల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ బి సంతోష్ సూచించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని సేవించడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని ఆయన తెలిపారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా