ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు

ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు

గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చునో, ఈ బోటు తయారీ ద్వారా నిరూపించారు. ఇదే బోటు ద్వారా గణేష్ నిమజ్జనోత్సవం అనంతరం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించనున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. వానలు వచ్చి వరదలలో మునిగిపోయిన వారిని కూడా ఈ బోటు ద్వారా కాపాడే అవకాశం ఉందని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ బోటును రూపొందించిన వారు తెలిపారు. మాసబ్ చెరువులో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ బోటును తిలకించిన ప్రతి ఒక్కరు ఔరా అంటూ అభినందిస్తున్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా