బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి

షాద్ నగర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన రియల్టర్ మచ్చేందర్

బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి

 మచ్చేందర్ కు ఒకటే కూతురు మైత్రి

పెన్ కౌంటర్, షాద్ నగర్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న మచ్చేందర్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. అతనికి ఒక్కతే కూతురు మైత్రి ఉంది. శంషాబాద్ లోని వర్ధమాన్ కళాశాలలో మైత్రి బీటెక్ చదువుతోంది. మచ్చేందర్ స్వగ్రామం పెద్ద షాపూర్ అని స్థానికులు తెలిపారు. వ్యాపార రీత్యా శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటూ సెటిల్ అయ్యాడు. రోజువారి కార్యక్రమాలలో భాగంగానే శనివారం మచ్చేందర్ తన కూతురుని వర్ధమాన్ కళాశాలకు బైక్ పై ఎక్కించుకొని షాద్ నగర్ బస్ స్టేషన్లో విడిచిపెట్టడానికి వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో తండ్రి కూతుళ్లు ఇద్దరు లారీ కింద పడ్డారు. సంఘటనా స్థలంలోనే కాసేపు రక్షించమని అందర్నీ వేడుకున్నారు. ప్రమాద ఘటన తీవ్రస్థాయిలో ఉండడంతో వారు కొద్దిసేపట్లోనే మరణించారు. మచ్చేందర్ విషాద సంఘటనను చూసిన స్థానికులు, పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం  మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 
        మర్రిగూడ (పెన్ కౌంటర్):-     మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు