బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి

షాద్ నగర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన రియల్టర్ మచ్చేందర్

బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి

 మచ్చేందర్ కు ఒకటే కూతురు మైత్రి

పెన్ కౌంటర్, షాద్ నగర్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న మచ్చేందర్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. అతనికి ఒక్కతే కూతురు మైత్రి ఉంది. శంషాబాద్ లోని వర్ధమాన్ కళాశాలలో మైత్రి బీటెక్ చదువుతోంది. మచ్చేందర్ స్వగ్రామం పెద్ద షాపూర్ అని స్థానికులు తెలిపారు. వ్యాపార రీత్యా శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటూ సెటిల్ అయ్యాడు. రోజువారి కార్యక్రమాలలో భాగంగానే శనివారం మచ్చేందర్ తన కూతురుని వర్ధమాన్ కళాశాలకు బైక్ పై ఎక్కించుకొని షాద్ నగర్ బస్ స్టేషన్లో విడిచిపెట్టడానికి వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో తండ్రి కూతుళ్లు ఇద్దరు లారీ కింద పడ్డారు. సంఘటనా స్థలంలోనే కాసేపు రక్షించమని అందర్నీ వేడుకున్నారు. ప్రమాద ఘటన తీవ్రస్థాయిలో ఉండడంతో వారు కొద్దిసేపట్లోనే మరణించారు. మచ్చేందర్ విషాద సంఘటనను చూసిన స్థానికులు, పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు