ఇబ్రహీంపట్నం సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా కావలి సురేష్.

పెన్ కౌంటర్, ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా కావలి సురేష్.

 

 

సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్, శివరాల సూర్యం 

 

సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిపిఐ మండల కమిటీ

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియా(సిపిఐ)మండల నూతన కార్యదర్శిగా కావలి సురేష్ ని శుక్రవారం ఆ పార్టీ మండల మహా సభలో ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్ లో, సిపిఐ పార్టీ 11వ మండల మహాసభలు నిర్వహించారు. ఈ మేరకు జరిగిన నూతన మండల కమిటీ ఎన్నికలో మండల కార్యదర్శిగా కావలి సురేష్ ని మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కావలి సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్న మండల కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ పార్టీకి ఎంతో చరిత్ర ఉన్నదని, కమ్యూనిస్ట్ లు నిరంతరం పేద ప్రజలకోసం అహర్నిశలు పోరాడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం కమ్యూనిస్ట్ లు చేసిన పోరాటం మర్వలేనిదన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో భూ పోరాటాలు చేసి నిరుపేదలకు భూములను, ఇంటి పట్టాలను పంచిన చరిత్ర ఉన్న పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ పార్టీ పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తు ఉన్న ప్రజల కోసం పోరాటంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ముందుగా గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టులే అని అన్నారు. పేదరిక నిర్మూలనకు, పేద వారికి భూమి, ఇంటి స్థలం కోసం సిపిఐ పార్టీ తరపున శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో సిపిఐ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవటానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కావలి నర్సింహా, ఏఐటీయూసీ నాయకులు ఒరిగంటి యాదయ్య, సిపిఐ నాయకులు నీలమ్మ, శివరాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు