దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం

దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న  బి ఆర్ ఎస్ నాయకత్వం

బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పార్టీ నాయకత్వానికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా కాలేశ్వరం నివేదిక వెలుగులోకి రావడం, కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించడంతో బీఆర్ ఎస్ నాయకత్వం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాలేశ్వరం పై కౌంటర్ ఎటాక్ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ నాయకత్వానికి ఇప్పుడు, కేసులు... అరెస్టుల భయం పట్టుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి చేజారి పోతారని భావిస్తున్నా మాజీ ఎమ్మెల్యే లను ఎలా కట్టడి చేయడం తెలియక డైనమా లో పడింది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు