చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి

చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి

 

బోనాల పండుగ ఓ కుటుంబంలో విషాదంతాన్ని మిగిలింది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్, బోటి తెల్లవారి తిని ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నగర శివారు ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట లో చోటు చేసుకుంది. ఆదివారం నాడు నగర శివారు ప్రాంతాలలో బోనాల పండుగను ప్రజలంతా సంబరంగా జరుపుకున్నారు. అదేవిధంగా చింతలకుంట లోని ఒక ఆర్టీసీ కార్మికుని కుటుంబం కూడా బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంది. బోనాల పండుగ కోసం సదరు ఆర్టీసీ కార్మికుడు చికెన్, బోటి కూర తెచ్చుకొని విందు భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిపి ఆరగించాడు . అయితే మరుసటి రోజు అదే చికెన్, బోటి కూర భుజించడంతో ఫుడ్ పాయిజన్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు