చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి
By Anand kumar
On
బోనాల పండుగ ఓ కుటుంబంలో విషాదంతాన్ని మిగిలింది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్, బోటి తెల్లవారి తిని ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నగర శివారు ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట లో చోటు చేసుకుంది. ఆదివారం నాడు నగర శివారు ప్రాంతాలలో బోనాల పండుగను ప్రజలంతా సంబరంగా జరుపుకున్నారు. అదేవిధంగా చింతలకుంట లోని ఒక ఆర్టీసీ కార్మికుని కుటుంబం కూడా బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంది. బోనాల పండుగ కోసం సదరు ఆర్టీసీ కార్మికుడు చికెన్, బోటి కూర తెచ్చుకొని విందు భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిపి ఆరగించాడు . అయితే మరుసటి రోజు అదే చికెన్, బోటి కూర భుజించడంతో ఫుడ్ పాయిజన్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు.
Tags:
About The Author

Related Posts
Latest News
05 Sep 2025 22:55:39
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...