ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి, తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో శ్రీలక్ష్మిని ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీలక్ష్మి 2022 లో సిబిఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీనిపైనే ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, శ్రీలక్ష్మికి చుక్కెదురయింది. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆమెను కేసు నుంచి తప్పించగా, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ వాదనలను వినకుండా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుకు సూచించింది. సిబిఐ వాదనలు విన్న తర్వాత శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి గనులు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులను నిర్వహించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న కేసు లో సస్పెండ్ కూడా అయ్యారు. ఆ తరువాత తిరిగి ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలను చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక శాఖలను నిర్వహించారు.
About The Author
