తెలుగు రాష్ట్రాల జల జగడాల పరిష్కారానికి మరో ముందడుగు.
By Anand kumar
On
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. జల శక్తి మంత్రి సమక్షంలో మరోసారి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గోదావరి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నీటి కేటాయింపుల గురించి
ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...