నలుగురు పిల్లల తల్లి... ప్రియుడే కావాలని వెళ్ళిపోయింది

నలుగురు పిల్లల తల్లి... ప్రియుడే కావాలని వెళ్ళిపోయింది

నలుగురు పిల్లల తల్లి భర్తను కాదనుకొని ప్రియుడే కావాలని పంచాయతీ పెట్టిన సంఘటన వరంగల్ జిల్లాలోని షోడా షా పల్లి పిట్టలగూడెంలో చోటుచేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడే కావాలన్నా పిల్లల తల్లిని ఆమె ప్రియుడుతోనే పంచాయతీ పెద్దలు పంపించి వేశారు. కాలియా శంకర్ కు చంద్రమ్మ కు 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యా తండా గ్రామపంచాయతీ శివారులోని వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు ఇంట్లో ఎవరితో చెప్పకుండా పారిపోయారు. పోలీసులకు భర్త ఫిర్యాదు చేయగా వారు పట్టుకొచ్చారు. పెద్దల మధ్య పంచాయతీ జరగగా, చంద్రమ్మ ను తల్లి గారి ఇంట్లో ఉండాలని కుల పెద్దలు ఆదేశించారు. అయితే చంద్రం మనం రాజు మళ్లీ మాయ మాటలు చెప్పి వేపల గడ్డ తండాకు తీసుకువచ్చినట్లు తెలుసుకున్న భర్త శంకర్, కుటుంబ సభ్యులతో కలిసి వారిపై దాడి చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. చంద్రమ్మ తనకు ప్రియుడే కావాలని చెప్పి వెళ్లిపోగా, భర్త శంకర్ మాత్రం తన భార్య ను తనకు అప్పగించాలని... తల్లి కోసం తన పిల్లల ఏడుస్తున్నారని, తనకే అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా