పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు

. ఎస్సై పవన్ కుమార్ 

పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు

 

 మహాదేవపూర్ పెన్ కౌంటర్

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల రాకపోకలతో పశువులు మృతి చెంది నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నోటీసు ఇచ్చామని అన్నారు. పశువులు రోడ్లపై రాకుండా యజమానులు జాగ్రత్త లు తీసుకోవాలని లేదంటే గ్రామపంచాయతీ పోలీస్ సమన్వయంతో యజమానులకు జరిమానా గుర్తించడమే కాకుండా పశువులను గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు