పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు
. ఎస్సై పవన్ కుమార్
By Anand kumar
On
మహాదేవపూర్ పెన్ కౌంటర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల రాకపోకలతో పశువులు మృతి చెంది నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నోటీసు ఇచ్చామని అన్నారు. పశువులు రోడ్లపై రాకుండా యజమానులు జాగ్రత్త లు తీసుకోవాలని లేదంటే గ్రామపంచాయతీ పోలీస్ సమన్వయంతో యజమానులకు జరిమానా గుర్తించడమే కాకుండా పశువులను గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...