ఒక భర్త... ఇద్దరు భార్యలు... అతడిని గొడ్డలితో నరికి చంపారు

ఒక భర్త... ఇద్దరు భార్యలు... అతడిని గొడ్డలితో నరికి చంపారు

భర్తను భార్యలు ఇద్దరు కలిసి గొడ్డలితో నరికి చంపిన ఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండల పరిధిలోని పిట్టలోని గూడెంలో చోటుచేసుకుంది. పిట్టలోని గూడానికి చెందిన కనకయ్యకు ఇద్దరు భార్యలు. చొక్కమ్మ, గౌరమ్మ ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెల్లే. కనకయ్య తాగిన మైకంలో యాదాద్రి జిల్లాలోని గుండాల మండలం పరిధిలో సుద్దాలలో తన అత్త అయిన జున్ను బాయి ( చుక్కమ్మ, గౌరమ్మల తల్లి ) ని తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషయాన్ని తన భార్య లిద్దరికి చెప్పకుండా సిద్దిపేటకు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కనకయ్య కోసం గాలిస్తున్నారు. కనకయ్య పిట్టలోని గూడెం తిరిగి రాగా తమ తల్లిని చంపినందుకు భార్యలు ఇద్దరు అతడితో గొడవపడ్డారు. ఇద్దరు కలిసి అతడిని గొడ్డలితో నరికి చంపి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు